హైదరాబాద్, 4 జూన్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ లో లోపాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మూడు నెలల రేషన్ బియ్యం ఒకే సారి ఇవ్వడం వల్ల ఒక వ్యక్తికి దాదాపు అరగంట పైనే సమయం పడుతుంది. క్యూ లైన్ లో నిలబడలేక జనాలు తమ చెప్పులు, సంచులు క్యూలో పెట్టి ఎండలో రోజంతా పడిగాపులు కాస్తున్నారు. దీనికి తోడు బయోమెట్రిక్ మిషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తి సర్వర్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల బియ్యం పంపిణీ మరింత జాప్యం జరుగుతోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే టెంట్, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటుతో పాటు సాంకేతిక ఇబ్బందులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఒక వ్యక్తికి రేషన్ ఇచ్చేందుకు దాదాపు 30 నుండి 45 నిమిషాల సమయం పడుతుందని సంబంధిత రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..