అమరావతి, 4 జూన్ (హి.స.)
- గుంటూరు లీగల్: గుంటూరు నగరంలోని న్యాయస్థానాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (పీపీ) కొరత వేధిస్తోంది. ప్రధాన జిల్లా కోర్టుతోపాటు ఏడు అదనపు జిల్లా కోర్టుల్లో నలుగురే పీపీలు విధులు నిర్వర్తిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా.. ఇంతవరకు కొత్తగా ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం ఒక పీపీ మూడు అదనపు కోర్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఏర్పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ