పాక్‌కు గూఢచర్యం కేసు.. మరో యూట్యూబర్‌ అరెస్టు
ఢిల్లీ, 4 జూన్ (హి.స.)పాకిస్థాన్‌ (Pakistan)కు గూఢచర్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు పంజాబ్‌ (Punjab)లోని మొహాలీ (Mohali)లో ఉన్న స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (SSOC) పాకిస్థాన్ మద్దతుతో నడుస్తున్న ఉగ్రవాద సంబంధిత గూఢచర్య నెట్‌వర్క్‌ను ఛ
పాక్‌కు గూఢచర్యం కేసు.. మరో యూట్యూబర్‌ అరెస్టు


ఢిల్లీ, 4 జూన్ (హి.స.)పాకిస్థాన్‌ (Pakistan)కు గూఢచర్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు పంజాబ్‌ (Punjab)లోని మొహాలీ (Mohali)లో ఉన్న స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (SSOC) పాకిస్థాన్ మద్దతుతో నడుస్తున్న ఉగ్రవాద సంబంధిత గూఢచర్య నెట్‌వర్క్‌ను ఛేదించినట్లుగా పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.

ఈ నెట్‌వర్క్‌లో రూప్‌నగర్‌లోని మహ్లాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్ (Jasbir Singh) ప్రమేయం ఉందని అందుకే అతడిని అరెస్ట్ చేశామని తెలిపారు. జస్బీర్ ‘జాన్ మహల్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతున్నాడని.. అతడికి 1.1 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు ఉన్నారని పేర్కొన్నారు. జస్బీర్ సింగ్ పాకిస్థానీ హ్యాకర్లతో సత్సంబంధాలు ఉన్నాయని, బహుళ భారత సంతతి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు.

వారిలో ఇటీవలే గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) ఉన్నారని పేర్కొన్నారు. అదేవిధంగా పాకిస్థాన్ మాజీ పాక్ హై కమిషన్ ఎహ్సాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్ (Ehsan-ur-Rahim alias Danish), జస్బీర్ సింగ్‌ను ఢిల్లీలో జరిగిన పాకిస్థాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించాడని, అక్కడ అతడు పాకిస్థాన్ ఆర్మీ అధికారులతో మాట్లాడినట్లుగా సమాచారం ఉందని డీజీపీ వెల్లడించారు. జస్బీర్ సింగ్ 2020, 2021, 2024 సంవత్సరాల్లో మూడు సార్లు పాకిస్థాన్‌కు వెళ్లాడని తెలిపారు. దీంతో అతడి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, వాటిలో పాకిస్థాన్‌కు చెందిన చాలామంది పెద్ద వాళ్ల కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ విభాగం మొత్ం డేటాను రిట్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని డీజీపీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande