దిల్లీ 4 జూన్ (హి.స.)ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్కు గట్టి దెబ్బ తగిలిందని.. ఆరు యుద్ధ విమానాలు, రెండు నిఘా విమానాలతోపాటు ఒక సీ-130 రవాణా విమానాన్ని కూడా కోల్పోయిందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు 30కిపైగా క్షిపణులను, పెద్ద సంఖ్యలో డ్రోన్లను కూడా భారత్ ధ్వంసం చేసిందని వివరిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో నమోదైన రాడార్, నిఘా వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థల డేటాను విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. రక్షణ శాఖలోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. ఇండియా టుడే సంస్థ ఈ మేరకు కథనాన్ని ప్రచురించింది. ఆ వివరాల మేరకు... ఆపరేషన్ సిందూర్ జరిగిన 4రోజుల్లో పాకిస్థాన్కు చెందిన ఆరు యుద్ధ విమానాలను మన వాయుసేన క్షిపణుల సాయంతో కూల్చివేసింది. ఇక సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని ఒక అత్యంత విలువైన ఎలకా్ట్రనిక్ వార్ఫేర్ (ఈడబ్ల్యూ) విమానం లేదా అవాక్స్ నిఘా విమానాన్ని సుదర్శన్ క్షిపణి వ్యవస్థను ఉపయోగించి ధ్వంసం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు