ఆ 12 దేశాల పౌరులకు అమెరికాలో నో ఎంట్రీ..
న్యూఢిల్లీ, 5 జూన్ (హి.స.) అమెరికా దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాలకు చెందిన పౌరులను యూఎస్‌లోకి అనుమతించకుండా నిషేధ
అమెరికా


న్యూఢిల్లీ, 5 జూన్ (హి.స.)

అమెరికా దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాలకు చెందిన పౌరులను యూఎస్‌లోకి అనుమతించకుండా నిషేధం విధించారు.అలాగే మరో ఏడు దేశాలకు చెందిన పౌరులపై ఆయన పాక్షిక నిషేధం విధించారు. అందుకు సంబంధించిన ఆదేశాలు గురువారం వైట్ హౌస్ విడుదల చేసింది.ఈ ఆదేశాలు జూన్ 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పూర్తిగా నిషేధం విధించిన దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్థాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఈక్వటోరియల్ గినీ, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్, ఎరిత్రియా ఉన్నాయి. అలాగే పాక్షిక నిషేధం విధించిన దేశాల జాబితాలో బురుండి, క్యూబా, లావోస్, టోగో, తుర్కిమిస్థాన్ వెనిజలా, సియెర్రా లియోన్ ఉన్నాయి. అమెరికా, దేశ భద్రతతోపాటు జాతీయ ప్రయోజనాలకు కాపాడటానికి తాను ఈ చర్యలకు ఉపక్రమించినట్లు దేశాధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande