బీసీల సంక్షేమానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, 5 జూన్ (హి.స.) బీసీల సంక్షేమం, అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో దిశగా ముందుకు సాగుతుందని ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, బిజెపి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘంలో జరిగిన కులగణన
బిజెపి ఎంపీ లక్ష్మణ్


హైదరాబాద్, 5 జూన్ (హి.స.)

బీసీల సంక్షేమం, అభివృద్ధికి మోదీ

ప్రభుత్వం కట్టుబడి ఉందని.. నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో దిశగా ముందుకు సాగుతుందని ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, బిజెపి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘంలో జరిగిన కులగణన పై బీసీ సంఘాల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ పార్టీలో బీసీలకు సముచిత -ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు.గతంలో ఏ ప్రభుత్వం చేయని పనులను కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు ఏ రకంగా అయితే హక్కులు కల్పించారో కులగణన ద్వారా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బీసీలకు ఆ హక్కు కల్పించను న్నారని తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande