తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి. 5 జూన్ (హి.స.)
పర్యావరణంతోనే మానవ
మనుగడ ముడిపడి ఉందని, పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కాలుష్య కారకాలైన పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్ వాడకంను తగ్గించాలని, అడవుల నరికివేత పై ద్రుష్టి సారించాలని అన్నారు.
ప్రతి ఒక్కరూ చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు