ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.. సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 5 జూన్ (హి.స.) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తెలంగాణ సీఎంవో కార్యాలయం ద్వారా గురువారం ఒక సందేశం విడుదల చేశారు. ప్రకృతిని
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 5 జూన్ (హి.స.)

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తెలంగాణ సీఎంవో కార్యాలయం ద్వారా గురువారం ఒక సందేశం విడుదల చేశారు. ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుందని తెలిపారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ ప్రధానాంశమైన ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు కట్టుబడి ఉందామని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించే ప్రతిజ్ఞ తీసుకుందామని పిలుపునిచ్చారు. సహజ వనరుల సంపదను రాబోయే తరాలకు అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ ధృక్పథమని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande