తెలంగాణ, సిద్దిపేట. 5 జూన్ (హి.స.)
ఈనెల 6 తేదీ నుంచి 8వ
తేదీ వరకు హుస్నాబాద్ లో జరిగే రైతు మహోత్సవ ఏర్పాట్లను సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి గురువారం పరిశీలించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నిర్వహిస్తున్న కిసాన్ మేళాలో జరుగుతున్న ఏర్పాట్ల తీరుపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు మహోత్సవ ప్రారంభ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి దాదాపు 6000 మంది రైతులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు, రైతులను కార్యక్రమానికి తీసుకురావడానికి ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు.
నూతన విత్తనాలు వ్యవసాయ పనిముట్లు తోపాటు పలు అంశాలను రైతులకు వివరించేందుకు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు జి కలెక్టర్ మన చౌదరి చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు