తిరుపతి,, 5 జూన్ (హి.స.) దివ్యదర్శన టోకెన్ల జారీకి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్లో తితిదే ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు ఉద్దేశించిన ఈ టోకెన్లను ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి భూదేవి కాంప్లెక్స్లో జారీ చేయనున్నారు. భక్తులు గతంలో మొదటి మెట్టు సమీపంలో టోకెన్లు తీసుకొని 1,200వ మెట్టు వద్ద స్కాన్ చేసుకునేవారు. ఈ ప్రక్రియలో ఉన్న ఇబ్బందులను గమనించిన అధికారులు దివ్యదర్శన టోకెన్ల జారీకి శ్రీనివాసమంగాపురం వద్ద శాశ్వత కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటివరకు భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు అందించనున్నారు. ఇక్కడ మొత్తం 10 కౌంటర్లు ఉండగా 4 దివ్యదర్శనం, 6 సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. ముందుగా బాలాజీ బస్టాండ్ ఆవరణలోని షెడ్లలోకి భక్తులను అనుమతించి క్యూలైన్లలోకి వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ