హైదరాబాద్, మంచిర్యాల. 5 జూన్ (హి.స.)
ప్రోటోకాల్ వ్యవహారంలో మంచిర్యాల జిల్లా జన్నారం ఇన్చార్జి ఎఫ్డీఓ మరియు జన్నారం ఇన్చార్జి రేంజ్ ఆఫీసర్ కు మెమో జారీ చేస్తూ, జన్నారం ఇన్చార్జి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ను సస్పెండ్ చేస్తూ కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ వైల్డ్ లైఫ్, విజిలెన్స్ పీసీసీఎఫ్ ఎలూసింగ్ మేరు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్ లో పర్యాటక కేంద్రాలను గుర్తించి అభివృద్ధి చేయాలని, తదితర అంశాలపై పరిశీలించడానికి ఈనెల 2న జన్నారం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆ ముగ్గురు అటవీశాఖ అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహించారనే అభియోగం మేరకు చర్యలు తీసుకున్నట్టు కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్డీపీటీ, మంచిర్యాల సీఎఫ్ శాంతారాం గురువారం ఉదయం తెలిపారు. ఈ మేరకు ఆ ఆదేశాల ప్రతులను జన్నారం ఎఫ్డీఓ, రేంజ్ కార్యాలయానికి పంపినట్లు ఆయన చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్