ఇథనాల్ ఫ్యాక్టరీ పోరుపై హరీశ్ రావు సీరియస్.
హైదరాబాద్, 5 జూన్ (హి.స.) ఇంకా ఎన్ని రకాలుగా రైతులను గోసపెడుతావ్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నిన్న జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్సర్లు, పోలీసులు రైతులపై విచక్షణారహితంగా దాడి చేశారన
హరీష్ రావు


హైదరాబాద్, 5 జూన్ (హి.స.)

ఇంకా ఎన్ని రకాలుగా రైతులను గోసపెడుతావ్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నిన్న జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్సర్లు, పోలీసులు రైతులపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఇవాళ (గురువారం) మాజీ మంత్రి హరీశ్రావు స్పందించారు. బీద రైతుల కడుపు కొట్టి బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిపోయిందని ఆరోపించారు. పాలమూరు బిడ్డను అని పదేపదే చెప్పుకునే సీఎం తన జిల్లాలోనే ఘటన జరిగి 24 గంటలు అవుతున్నా స్పందించరా? అని ప్రశ్నించారు. పోలీసులు 12 గ్రామాల రైతులను కొట్టి, 40 మందిపై కేసులు పెట్టి, 12 మంది రిమాండ్ కి పంపించడం దుర్మార్గమన్నారు. రైతులను కొట్టించిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమానిపై కానీ, బౌన్సర్లపై కానీ ఎందుకు కేసులు పెట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande