హైదరాబాద్, 5 జూన్ (హి.స.) హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హుటా హుటిన గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. AIG ఆస్పత్రిలో ఐసీయూలో అతనికి చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. 2014, 2018, 2023లో మూడు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు, పలువురు BRS నేతలు హుటాహుటిన AIG ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు..
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్