బెంగళూరు, 5 జూన్ (హి.స.)
బెంగళూరు లోని
చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇవాళ అనగా గురువారం మధ్యాహ్నం 2.30కి తొక్కిసలాట కేసుపై కర్ణాటక హైకోర్టు విచారణను ప్రారంభించనుంది. కాగా, బుధవారం జరిగిన తొక్కిసలాటలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ మేరకు వైద్య శాఖ మృతదేహాలకు పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తి చేసి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..