హైదరాబాద్, 5 జూన్ (హి.స.)
తెలంగాణ సచివాలయంలోని కేబినెట్ హాల్ వద్ద గురువారం ఉదయం కీలక సంఘటన చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడ ఉన్నవారంతా కాసేపు ఆందోళనకు లోనయ్యారు. మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం. వెంటనే అక్కడే హుటాహుటిన అక్కడకు చేరిన వైద్య బృందం ఆమెకు ప్రాథమిక వైద్యం అందించింది.
మెడికల్ పరీక్షల అనంతరం వైద్యులు మంత్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ప్రకటించారు. లో బీపీ కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు డాక్టర్లు తెలిపారు. తక్షణమే ఇంజెక్షన్ ఇచ్చి, కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు సూచించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్