ఎన్ఐఏ దూకుడు.. జమ్మూ కాశ్మీర్లో 32 ప్రాంతాల్లో సోదాలు
జమ్మూ కాశ్మీర్, 5 జూన్ (హి.స.) పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం టెర్రరిస్టులపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఐబీ సమాచారంతో ఉగ్రవాదుల జాడలను కనిపెట్టి.. హతమారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్ల
ఎన్ఐఏ దూకుడు


జమ్మూ కాశ్మీర్, 5 జూన్ (హి.స.)

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం టెర్రరిస్టులపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఐబీ సమాచారంతో ఉగ్రవాదుల జాడలను కనిపెట్టి.. హతమారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో కంటిన్యూ గా సోదాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కాశ్మీర్లో 32 ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తుంది. ఈ సోదాల్లో ఉగ్రవాద సంబంధిత కేసులకు సంబంధించినవని, ప్రత్యేకించి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWs), ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వారిపై దృష్టి సారించిందని తెలుస్తోంది. ఇవి.. షోపియాన్, కుల్గామ్, పుల్వామా, సోపోర్, కుప్వారా, బారాముల్లా వంటి జిల్లాలో జరుగుతున్నాయి. 2022 లో నమోదైన ఒక కేసుకు సంబంధించిన లష్కర్-ఎ-తోయిబా (LeT), జైష్-ఎ- మహ్మద్ (JeM) వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వారి కదలికలు ఉన్నట్లు సమాచారం

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande