అమరావతి, 5 జూన్ (హి.స.)ప్రకృతి అంటే ఏ ఒక్కరి సొత్తు కాదని.. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ..ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
అందులో అడవులను కాపాడుకోవాలి, జలవనరులను సంరక్షించుకోవడం మన కర్తవ్యం. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. మంచి పరిసరాలు ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుంది.
అందుకే స్వచ్ఛ భారత్లో భాగంగా మనం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టాము. చెత్తను ఇంధనంగా మారుస్తూ ప్రకృతిని కాపాడుతున్నాం. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలన అంశాన్ని థీమ్గా తీసుకున్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి మన వంతు బాధ్యతగా పని చేద్దాం. పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకుందాం! అని సీఎం చంద్రబాబు నాయుడు తన ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు. కాగా ఈ రోజు రాజధాని అమరావతిలో సీఎం, డిప్యూటీ సీఎం వనమహోత్సవం (Forest Festival) కార్యక్రమంలో పాల్గొననున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి