5వేలకు చేరువలో కోవిడ్ కేసులు.. రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ కు కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ, 5 జూన్ (హి.స.) దేశంలో రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. నెమ్మదిగా మొదలైన కరోనా కేసుల సంఖ్య ఐదు వేలకు చేరువలోకి వచ్చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4, 866 కేసులు ఉన్నట్లుగా ఆరోగ్య
కోవిడ్


న్యూఢిల్లీ, 5 జూన్ (హి.స.)

దేశంలో రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. నెమ్మదిగా మొదలైన కరోనా కేసుల సంఖ్య ఐదు వేలకు చేరువలోకి వచ్చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4, 866 కేసులు ఉన్నట్లుగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

గత 24 గంటల్లో ఏడు మరణాలు సంభవించాయని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నేడు అనగా గురువారం ఉదయం 8 గంటలకు 4,866కు కేసులు పెరిగినట్లుగా స్పష్టం చేసింది. ఇక మరణాల విషయానికొస్తే.. ఢిల్లీ, కర్ణాటకలలో చెరో 2 మరణాలు సంభవించగా.. మహారాష్ట్రలో 3 మరణాలు సంభవించాయి. బుధవారం కేరళలో 114 కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో వరుసగా 112, 106, 105 కేసులు నమోదయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande