రాష్ట్రం లో ఈ నెల.9.నుంచి ప్రధానోపాధ్యాయులు.స్కూల్ అసిస్టెంట్లకు సన్నద్ధత శిక్షణ
అమరావతి, 5 జూన్ (హి.స.), రాష్ట్రంలో ఈనెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లకు ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు పాఠశాలల సన్నద్ధత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీ
రాష్ట్రం లో ఈ నెల.9.నుంచి ప్రధానోపాధ్యాయులు.స్కూల్ అసిస్టెంట్లకు సన్నద్ధత శిక్షణ


అమరావతి, 5 జూన్ (హి.స.), రాష్ట్రంలో ఈనెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లకు ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు పాఠశాలల సన్నద్ధత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వం ఇంతకుముందు జారీ చేసిన ఆదేశాల ప్రకారం... ఈ పాఠశాలల రెడీనెస్‌ ప్రోగ్రాం కోసం గురువారం నుంచే ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ఈనెల 9 నుంచి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande