సాగులో సాంకేతికతతో అధిక దిగుబడులు. వ్యవసాయ శాస్త్రవేత్త
సూర్యాపేట., 5 జూన్ (హి.స.) పంటల సాగులో సాంకేతికతను వినిగిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని వరి పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పద్మావతి తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా మోతే మండలం సర్వారం గ్రామంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్
వ్యవసాయ శాస్త్రవేత్త


సూర్యాపేట., 5 జూన్ (హి.స.)

పంటల సాగులో సాంకేతికతను వినిగిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని వరి పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పద్మావతి తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా మోతే మండలం సర్వారం గ్రామంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా వరిని ఆశించు చీడపీడల గురించి, పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. కేవీకే గడ్డిపల్లి సీనియర్ సైంటిస్ట్ హెడ్ ఇన్చార్జి డి. నరేశ్ మాట్లాడుతూ.. వివిధ రకాల జీవన ఎరువుల వాడకం వల్ల రైతులకు కలిగే ఉపయోగాలను వివరించారు. కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ పి.అక్షిత్సాయి పీఎం పసల్ బీమా యోజన గురించి వివరించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande