హైదరాబాద్, 5 జూన్ (హి.స.) బుధవారం వియత్నాం దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో బట్టల దుకాణం నిర్వహిస్తున్న అర్జున్ కి ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు అర్షిద్ (21) వియత్నాంలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్నాడు.. తన ఇంటి నుంచి స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి గోడను ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో అశ్రిత్ స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అశ్రిత్ మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..