తెలంగాణ, జోగులాంబ గద్వాల. 5 జూన్ (హి.స.)
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామ శివారులో నిర్మాణం అవుతున్న ఇథనాల్ కంపెనీ పనులను అడ్డుకొని.. వాహనాలను ధ్వంసం చేసిన ఘటనలో కంపెనీ సీఈఓ మంజునాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 40 మందిపై కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన అనంతరం రెండు వాహనాల్లో దాడులకు పాల్పడిన వారిని పోలీసులు మానవపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా దాడులకు పాల్పడిన వారి వీడియోలు.. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఘటన జరగడానికి 40 మంది కారకులుగా గుర్తించారు. వీరిలో 12 మందిని పోలీసులు అరెస్టు చేసి గురువారం కోర్టులో ప్రవేశపెట్టారు. మిగిలిన వారిలో కొందరు గాయపడి వైద్య సేవలు పొందుతుండగా.. మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు