తెలంగాణ, నాగర్ కర్నూల్. 5 జూన్ (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా,
కల్వకుర్తి పట్టణ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. విద్యానగర్ కేశ నగర్ కాలనీలో రూపాయలు 25 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి నిర్మాణ పనులను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ ప్రజల విజ్ఞప్తి మేరకు విద్యుత్ స్తంభాలు లైట్లు ఏర్పాటు చేశామని అన్నారు.
త్వరలోనే కాలనీలో సీపీ రోడ్డు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. అనంతరం కాలనీ ప్రజలు ఆయనను ఘనంగా సత్కరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు