ఆత్మకూరు 5 జూన్ (హి.స.): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం ఏఎస్ పేట వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్ కోసం కూలీలు ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ