తెలంగాణ, ఖమ్మం. 5 జూన్ (హి.స.)
రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకు మృతి
చెందిన సంఘటన గురువారం ఖమ్మం నగరంలో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం మేరకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని దుబ్బ తండ గ్రామానికి చెందిన సర్పంచ్ అజ్మీరా బాల్య తన కొడుకు సాయికుమార్ తో కలిసి ద్విచక్రవాహనం పై ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వైరా రోడ్డు కు వెళుతున్నారు. ఈ క్రమంలోనే వారిని వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో వారిద్దరూ లారీ టైర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సాయి కుమార్ ఖమ్మం నగరంలోని కృష్ణవేణి కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు