చిత్తూరు , 5 జూన్ (హి.స.) చిత్తూరు జిల్లా వి.కోట మండలం మోట్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది . చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న వారంతా ఈతకు వెళ్లారు. నీట మునిగిన వారిని కాపాడేందుకు ఒడ్డున ఉన్న మరికొందరు విద్యార్థులు యత్నించారు. అప్పటికే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతులను మోట్లపల్లి గ్రామానికి చెందిన కుషాల్, నిఖిల్, జగన్గా గుర్తించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఇద్దరు ఉన్నారు.
x
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ