అమరావతి, 5 జూన్ (హి.స.)ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే వరదనీటితో రోజురోజుకూ నీటిమట్టం పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 834.60 అడుగులు ఉండగా.. నీటి నిల్వ 54.55 టీఎంసీలుగా నమోదైంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల జలాశయం నుంచి 21,334 క్యూసెక్కులు వచ్చి చేరింది. ఇందులో విద్యుదుత్పత్తి, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,543 క్యూసెక్కులు నీరు విడుదల చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ