బెంగళూరు తొక్కిసలాటపై బీజేపీ ఎంపీ తేజస్వి కీలక వ్యాఖ్యలు
బెంగళూరు, 5 జూన్ (హి.స.)ఆర్సీబీ విక్టరీ పరేడ్ (RCB Victory Parade) సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వద్ద తొక్కిసలాట జరిగి 12 మంది అభిమానులు మృతి చెందగా, 47 మందికి గాయాలు అయ్యాయి. కాగా ఈ విషాద సంఘటనతో స్థానిక ప్రభుత్వం
బెంగళూరు తొక్కిసలాటపై బీజేపీ ఎంపీ తేజస్వి కీలక వ్యాఖ్యలు


బెంగళూరు, 5 జూన్ (హి.స.)ఆర్సీబీ విక్టరీ పరేడ్ (RCB Victory Parade) సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వద్ద తొక్కిసలాట జరిగి 12 మంది అభిమానులు మృతి చెందగా, 47 మందికి గాయాలు అయ్యాయి. కాగా ఈ విషాద సంఘటనతో స్థానిక ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (BJP MP Tejaswi Surya) తొక్కిసలాటపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొక్కిసలాట (Stampede)లో ఆర్సీబీ అభిమానులు చనిపోవడం బాద కలిగించింది.. ఈ ఘటన పూర్తిగా నివారించదగినది. ఇది రాష్ట్రం ఆధ్వర్యంలో జరిగింది.. నిన్న ముఖ్యమంత్రి అందరికీ బహిరంగ ఆహ్వానం పంపారు. తగిన భద్రత, సురక్షిత, జనసమూహ నిర్వహణ ఏర్పాట్లు చేయకుండా ఈ ఆహ్వానం ఇచ్చారు.

ఈ ప్రమాదానికి ఆర్‌సీబీ, విరాట్ కోహ్లీ, అభిమానులను నిందించలేము. ఈ ఘటనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంది. వీరు అనవసరమైన గుర్తింపు కోసం ఈ ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ను.. కాంగ్రెస్ నాయకుల కుటుంబ కార్యక్రమం గా మార్చారు. ఇప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థికంగా పరిహారం అందించాలి. గాయపడిన వారికి, తమ వారిని కోల్పోయిన కుటుంబాల ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. దేశంలో ఆర్‌సీబీకి ఉన్నటువంటి విధేయత, అభిమానం ఏ ఇతర జట్టుకు లేదు. బెంగళూరు వాసులు ఆర్‌సీబీని తమ కుటుంబంలా భావిస్తారు. మేము మీతో మంచి, చెడు సమయాల్లో ఉన్నాం, ఇప్పుడు ఆర్‌సీబీ తమ అభిమానులతో ఈ కష్ట సమయంలో నిలబడాల్సిన సమయం వచ్చిందని ఎంపీ తేజస్వి చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande