అమరావతి, 5 జూన్ (హి.స.)భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) 11 ఏళ్ల ఎన్డీయే ప్రభుత్వం పాలన పూర్తి, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKY)పై ఈ రోజు ఉదయం ప్రత్యేక ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే దార్శనికత తో నడిచే భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో, దేశవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి, పేదరిక నిర్మూలనతో పాటు ప్రజల పరివర్తనాత్మక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.
11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKY) ప్రత్యేకమైన మైలురాయి తాకింది. PMGKY ద్వారా దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా పౌరులు పరివర్తనాత్మక నిర్ణయాలు, సంక్షేమ పథకాల నుంచి ప్రయోజనం పొందారు. ఇవి వారి జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచాయి. ప్రతి పౌరుడు స్వావలంబన పొంది గౌరవంగా జీవించడానికి సాధికారత కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అంకితభావ ప్రయత్నాలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సంపన్నమైన, సమ్మిళిత భారతదేశం వైపు మనమందరం కలిసి ముందుకు సాగుదాం. అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) రాసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి