తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 5 జూన్ (హి.స.)
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో గ్రీన్ ర్యాలీని నిర్వహించారు. సింగరేణి మహిళా కళాశాల నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్, కొత్తగూడెం బస్టాండ్ మీదుగా ఐఎంఏ హాల్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో కేటీపీస్ సింగరేణి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర ఉమ్మడి జిల్లా పరిశ్రమల ప్రతినిధులు, సింగరేణి కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ఉద్దేశ్యమైన ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతం చేద్దాం' అనే అంశంపై అవగాహన సదస్సుని ఐఎంఏ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ చట్టాలు - జిల్లాలో వాటి అమలును, పరిశ్రమలు, ప్రజలు వారి దైనందిన జీవితంలో తీసుకోవలసిన పర్యావరణ హితమైన చర్యలు గురించి కలెక్టర్ వివరించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి వాటి బదులుగా నారా లేదా గుడ్డ సంచులను వాడాలని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు