ఢీల్లీ, 5 జూన్ (హి.స.)పాకిస్తాన్పై భారత్ దాడులకు సంబంధించి ప్రధాని నరేద్ర మోడీపై ప్రతిపక్ష, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీ విమర్శలపై కాంగ్రెస్ నేత శశి థరూర్ స్పందించారు.
ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించే అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న శశి థరూర్.. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. భారత్, పాకిస్తాన్ వివాదానికి సంబంధించి ఏ సమయంలోనూ, ఎప్పుడూ మూడో పక్షం జోక్యం లేదని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య శాంతికి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వాదనల ప్రస్తావిస్తూ , 'భారత్ను యుద్ధం ఆపమని ఒప్పించాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఆగితే, మేము ఆపడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి వారు పాకిస్తాన్ను 'మీరు ఆపండి ఎందుకంటే భారత్ ఆపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఉండవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి