ఎన్డీయే ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్
ఢీల్లీ, 5 జూన్ (హి.స.)భారతదేశంలో ఎన్డీయే ప్రభుత్వం (NDA Govt) అధికారంలోకి వచ్చి నిన్నటితో 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దేశంలో వారి 11 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఆసక్తికరమై
Modi


ఢీల్లీ, 5 జూన్ (హి.స.)భారతదేశంలో ఎన్డీయే ప్రభుత్వం (NDA Govt) అధికారంలోకి వచ్చి నిన్నటితో 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దేశంలో వారి 11 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఆసక్తికరమైన పోస్ట్ (Interesting post) చేశారు. ప్రధాని తన ట్వీట్‌లో గత దశాబ్దంలో.. ఎన్‌డీఎ ప్రభుత్వం పేదరికం బారి నుంచి అనేక మందిని బయటకు తీసుకు వచ్చేందుకు అనేక పథకాలను అమలు చేసింది. సాధికారత, మౌలిక సదుపాయాలు, సమగ్రతపై దృష్టి సారించింది. మా అన్ని కీలక పథకాలు పేదల జీవితాలను మార్చివేశాయి.

పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్జ్వల యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు గృహనిర్మాణం, శుభ్రమైన వంట ఇంధనం, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరిచాయి. డిబిటి, డిజిటల్ సమగ్రత, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రోత్సాహం పారదర్శకతతో చివరి వ్యక్తి వరకు ప్రయోజనాల వేగవంతమైన డెలివరీని నిర్ధారించింది. ఇందువల్లే 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికాన్ని జయించగలిగారు. ఎన్‌డీఎ ప్రభుత్వం ప్రతి పౌరుడికి గౌరవంతో జీవించే అవకాశం ఉన్న సమగ్ర, స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంది. అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande