అయోధ్య /ఢిల్లీ, 5 జూన్ (హి.స.)ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో గురువారం మరో అద్భుతం చోటుచేసుకుంది. అంగరంగ వైభవంగా రామమందిర మొదటి అంతస్థులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. వేద మంత్రోచ్ఛారణ, హవనంతో రామ దర్బార్ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి సముదాయంలో రాజారామ్, ఇతర దేవతలను ప్రతిష్టించారు. గతేడాది జనవరిలో జరిగిన మొదటి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత జరిగిన రెండవ కార్యక్రమం ఇది.
మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుక జూన్ 3న ప్రారంభమైంది. జూన్ 5న ముగింపు వేడుకతో ముగుస్తుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని ఆంజనేయ సేవా ట్రస్ట్ నిర్వహించింది. రామాలయంలోని మొదటి అంతస్తులో రామ దర్బార్ విగ్రహాలకు (రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు) ప్రాణ ప్రతిష్ఠతో పాటు మరో ఏడు దేవాలయాల్లో విగ్రహాల ప్రతిష్ఠ జరిగింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ ఆచారాన్ని చందౌలి జిల్లాకు చెందిన ప్రసిద్ధ పండిట్ జైప్రకాష్ నేతృత్వంలో 101 మంది వేద ఆచార్యులు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు