న్యూఢిల్లీ, 7 జూన్ (హి.స.)
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మూడ్రోజుల క్రితమే ఆమె ఆసుపత్రిలో చేరగా.. ఇవాళ వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇంకా ప్రకటన చేయలేదు. అనారోగ్యానికి సంబంధించినపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గతంలోనూ స్వల్ప అస్వస్థతకు గురై న్యూఢిల్లీలోని సర్ గాంగారమ్ ఆసుపత్రిలో సోనియా గాంధీ చికిత్స తీసుకున్నారు. కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించారు. వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జీ అయ్యారు. తాజాగా మరోసారి ఆమె ఆసుపత్రిలో చేరడం కాంగ్రెస్ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..