పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. గత 24 గంటలలో 391 కొత్త కేసులు.. నాలుగు మరణాలు
న్యూఢిల్లీ, 7 జూన్ (హి.స.) దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 391 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,755కు పెరిగింది. అదే సమయంలో నిన్న ఒక్కరోజే నాలుగు మరణాలు కూడా నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శ
కరోనా కేసులు


న్యూఢిల్లీ, 7 జూన్ (హి.స.)

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 391 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,755కు పెరిగింది. అదే సమయంలో నిన్న ఒక్కరోజే నాలుగు మరణాలు కూడా నమోదయ్యాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 391 మందికి పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం దేశంలో 5755 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకూ 5,484 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా కేరళలో 1806 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 717, ఢిల్లీలో 665, పశ్చిమ బెంగాల్లో 622, మహారాష్ట్రలో 577, కర్ణాటకలో 444 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీలో నిన్న ఒక్కరోజే 10 కేసులు వెలుగు చూడగా.. తెలంగాణలో నాలుగు కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఏపీలో 72, తెలంగాణలో 9 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కొవిడ్తో మరణించిన వారి సంఖ్య 59కి పెరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande