బీజాపుర్, 7 జూన్ (హి.స.)ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం గత కొన్ని రోజులుగా కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బీజాపుర్ జిల్లాలోని నేషనల్ పార్క్లో జరుగుతున్న ఆపరేషన్లో మూడో రోజు మరో ఇద్దరు మావోయిస్టు అగ్ర కమాండర్లు మృతి చెందారు. వీరి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలం నుంచి పెద్దఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
గత మూడు రోజులుగా నేషనల్ పార్క్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ (Anti Naxal Operation) కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. గడిచిన రెండు రోజుల్లో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ మృతి చెందారు. సుధాకర్పై రూ.కోటి, భాస్కర్పై రూ.25లక్షల రివార్డ్ ఉంది. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని భద్రతా బలగాలు వెల్లడించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు