హైదరాబాద్, 8 జూన్ (హి.స.)
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో జగిత్యాల జిల్లా ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు చోటు లభించనుంది. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందుబాటులో ఉండాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నాలుగు రోజుల క్రితం తెలంగాణ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాలు కలిసి తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాలని విన్నవించడంతో ఢిల్లీ పెద్దలు ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు.మాదిగ సామాజిక వర్గ కోటా కింద లక్ష్మణ్ కుమార్ ను మంత్రి పదవి వరించనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..