తొక్కిసలాట ఘటనపై హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ( UPDATE)
బెంగళూరు, 9 జూన్ (హి.స.)ఐపీఎల్ 2025 లో ట్రోఫి విజయం తర్వాత జూన్ 4న చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట (stampede) జరిగింది. ఈ ఘటనపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని క
తొక్కిసలాట ఘటనపై హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ( UPDATE)


బెంగళూరు, 9 జూన్ (హి.స.)ఐపీఎల్ 2025 లో ట్రోఫి విజయం తర్వాత జూన్ 4న చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట (stampede) జరిగింది. ఈ ఘటనపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

ఈ ఎఫ్‌ఐఆర్‌లో నేరపూరిత నిర్లక్ష్యం (criminal negligence) ఆరోపణలతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్), 115, 118, 190, 132, 125(12), 142, మరియు 121 వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది.KSCA అధ్యక్షుడు రఘురామ్ భట్, ఇతర కార్యవర్గ సభ్యులు ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ 2025 జూన్ 6న కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎస్.ఆర్. కృష్ణ కుమార్ ఈ పిటిషన్‌ను విచారించారు. KSCA అధికారులైన రఘురామ్ భట్, ఎ. శంకర్, ఇ.ఎస్. జైరామ్‌లకు తాత్కాలిక అరెస్టు రక్షణ కల్పించారు. అయితే వారు దర్యాప్తుతో సహకరించాలని ఆదేశించారు. అదే సమయంలో.. RCB మార్కెటింగ్, రెవెన్యూ హెడ్ నిఖిల్ సోసలే కూడా తన అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు తాత్కాలిక రక్షణ నిరాకరించబడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande