తెలంగాణ, మంచిర్యాల. 12 జూలై (హి.స.)
భూ వ్యవహారంలో క్రిమిసంహారక మందు డబ్బా పట్టుకొని తాగి చనిపోతానని ఆఫీసులో తహసీల్దార్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ విధులకు ఆటంకపరిచి హల్చల్ చేసిన ఓ వ్యక్తి పై కేసు నమోదయింది. మంచిర్యాల జిల్లా జన్నారం తహసీల్దార్ సి.రాజమనోహర్ రెడ్డి విధులకు ఆటంకపరిచి, క్రిమిసంహారక మందు తాగి చనిపోతానని బ్లాక్ మెయిల్ చేసిన కయ్యం రామన్నపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన కయ్యం మల్లయ్య, రెండో కుమారుడు కయ్యం తిరుపతి భార్య లావణ్య పట్ట మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మల్లయ్య చిన్న కుమారుడైన రామన్న శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తాహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పురుగుల మందు తాగి చనిపోతానంటూ బ్లాక్ మెయిల్ చేసి, విధులకు ఆటంక పరిచినందుకు తాహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేశామని వారు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు