శ్రీశైలం.జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం.కొనసాగుతోంది
అమరావతి, 16 జూలై (హి.స.) శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం డ్యామ్‌కు 54,256 క్యూసెక్కులు మాత్రమే చేరుతోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 88,247 క్యూసెక్కులు. పోతిరెడ్డిపాడు నుంచి
శ్రీశైలం.జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం.కొనసాగుతోంది


అమరావతి, 16 జూలై (హి.స.)

శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం డ్యామ్‌కు 54,256 క్యూసెక్కులు మాత్రమే చేరుతోంది.

శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 88,247 క్యూసెక్కులు. పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,932 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande