శ్రావణ మాసం వేళ మహిళలకు బిగ్ షాక్.. ఇప్పుడు తులం గోల్డ్ రేటు ఎంతో తెలిస్తే..!
ముంబై, 23 జూలై (హి.స.)బాబోయ్‌ బంగారం భగ్గుమంటోంది…గోల్డ్‌ ప్రియులకు షాకిస్తూ ఏకంగా లక్ష రూపాయలు దాటేసింది. వచ్చేది శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడం, వరుస పండుగల నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. కానీ, ఊహించని విధంగా పసిడి
Gold


ముంబై, 23 జూలై (హి.స.)బాబోయ్‌ బంగారం భగ్గుమంటోంది…గోల్డ్‌ ప్రియులకు షాకిస్తూ ఏకంగా లక్ష రూపాయలు దాటేసింది. వచ్చేది శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడం, వరుస పండుగల నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. కానీ, ఊహించని విధంగా పసిడి పరుగులు తీస్తోంది. గతంలో ఒకటి రెండు సార్లు తగ్గిన బంగారం ధర నూతన రికార్డు సృష్టించింది. ఇటీవలి కాలంలో పసిడి కదలికలు కాస్త అటు ఇటుగా పెరుగుతూ తగ్గుతూ వచ్చాయి. కానీ, జులై 23నాటికి పెరిగిన పుత్తడి ధరలు చరిత్రలోనే సరికొత్త మైలురాయిని తాకాయి. తాజాగా భారీగా పెరిగిన బంగారం ధరలు సామాన్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

భారతదేశం – ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.10,130లకు చేరుకుంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.9,286లు. కాగా, 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.7,598లకు చేరింది.

ఇక, దేశవ్యాప్తంగా 10 గ్రాముల పసిడి ధరలు ఇలా ఉన్నాయ్..

– ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10గ్రాములు రూ.1,01,450, 22 క్యారెట్ల ధర 10గ్రాములు రూ.93,010 లుగా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర 10గ్రాములు రూ.1,01,300, 22 క్యారెట్ల ధర 10గ్రాములు రూ.92,860 ఉంది.

– చెన్నైలో 24 క్యారెట్ల ధర 10గ్రాములు రూ.1,01,300 ఉండగా.. 22 క్యారెట్ల ధర 10గ్రాములు రూ.92,860 గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande