నేటి నుంచి 2 దేశాల్లో పర్యటించనున్న మోడీ
న్యూఢిల్లీ, 23 జూలై (హి.స.)ప్రధాని మోడీ మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నేటి నుంచి ఈనెల 26 వరకు రెండు దేశాల్లో పర్యటించనున్నారు. జూలై 23-26 తేదీల్లో యూకే, మాల్దీవుల్లో మోడీ పర్యటించనున్నారు. ఇటీవలే ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చార
Prime Minister Modi addressing the Parliament of Ghana.


న్యూఢిల్లీ, 23 జూలై (హి.స.)ప్రధాని మోడీ మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నేటి నుంచి ఈనెల 26 వరకు రెండు దేశాల్లో పర్యటించనున్నారు. జూలై 23-26 తేదీల్లో యూకే, మాల్దీవుల్లో మోడీ పర్యటించనున్నారు. ఇటీవలే ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చారు. కొద్ది రోజుల గ్యాప్‌లనే మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్లడం విశేషం.

23, 24 తేదీల్లో మోడీ యునైటెడ్ కింగ్‌డమ్‌లో పర్యటించనున్నారు. భారతదేశం-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకం చేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులపై ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా భారతదేశానికి విస్కీ, కార్ల వంటి బ్రిటిష్ ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. ఇదిలా ఉంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande