ముంబై, 3 జూలై (హి.స.)దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. ఆషాఢ మాసం పండుగల సీజన్, శ్రావణ మాసం పెళ్లిల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి షాకిస్తూ పసిడి పరుగులు పెడుతోంది. జూన్ నెలాఖరున వరుసగా 7-8 రోజులుగా తగ్గిన గోల్డ్ ధర ఇప్పుడు వరుసగా పెరుగుతోంది. జూలై మొదటి రోజునుండి బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోంది. ఈరోజు కూడా గోల్డ్ రేట్ పెరిగింది. ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి .
– ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,050, 22 క్యారెట్ల ధర రూ.90,810 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,09,900 లుగా ఉంది.
– ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,900, 22 క్యారెట్ల ధర రూ.90,660 ఉంది. వెండి ధర కిలో రూ.1,09,900 గా ఉంది. – చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.98,900 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,660 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,20,100 లుగా ఉంది. – బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,900, 22 క్యారెట్ల ధర రూ.90,660 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,19,900 లుగా ఉంది. – హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,900 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,660 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,900 గా ఉంది. – విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,900, 22 క్యారెట్ల ధర రూ.90,660లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,19,900 లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి