పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర!
ముంబై, 5 జూలై (హి.స.)దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది కొనుగోలుదారులకు మంచి అవకాశం. నిన్నటితో పోల్చి చూస్తే గోల్డ్‌ నేడు మరింతగా తగ్గినట్లు గమనించవచ్చు. కొద్ది రోజుల వరకు బంగారం ధరలు లక్ష రూపాయలు వరకు దాటగా, ప్రస్తుతం స్వల్పంగా దిగివస్
GOLD


ముంబై, 5 జూలై (హి.స.)దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది కొనుగోలుదారులకు మంచి అవకాశం. నిన్నటితో పోల్చి చూస్తే గోల్డ్‌ నేడు మరింతగా తగ్గినట్లు గమనించవచ్చు. కొద్ది రోజుల వరకు బంగారం ధరలు లక్ష రూపాయలు వరకు దాటగా, ప్రస్తుతం స్వల్పంగా దిగివస్తున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా బంగారం ధరలు దిగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్నటువంటి బంగారం ధర తగ్గి రావడమే ఒక కారణం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు అనుకూలంగా ఉండటం, పెట్టుబడిదారుల ఆసక్తి స్టాక్ మార్కెట్స్ పై ఉండడంతో బంగారం ధరలు తగ్గాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై 5వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

– ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,870, 22 క్యారెట్ల ధర రూ.90,640 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,09,900 లుగా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490 ఉంది. వెండి ధర కిలో రూ.1,09,900 గా ఉంది.

– చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.98,720 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,19,900 లుగా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,09,900 లుగా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,720 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,490 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,900 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,19,900 లుగా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,19,900 లుగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande