డెహ్రాడూన్, 5 జూలై (హి.స.) నిత్యం అధికారిక సమీక్షలు, సమావేశాలతో తీరిక లేకుండా గడిపే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, అందుకు భిన్నంగా ఓ కొత్త పాత్రలో కనిపించారు. ఏకంగా రైతు అవతారమెత్తి, పొలంలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాడెద్దులతో నాగలి పట్టి పొలాన్ని దున్ని, స్థానిక రైతులతో కలిసి వరి నాట్లు వేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమంత్రి ధామి తన సొంత పొలంలో సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పనులు చేపట్టారు. కాడెద్దులతో నాగలి పట్టి పొలాన్ని దుక్కి దున్నారు. అనంతరం అక్కడున్న స్థానిక రైతులతో కలిసిపోయి ఉత్సాహంగా వరి నాట్లు వేశారు. సీఎం సామాన్యుడిలా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవ్వడంతో ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి