మల్కాజిగిరి నియోజకవర్గ నుండి నామినేషన్ దాఖలు చేసిన ఈటెల రాజేందర్
మేడ్చల్ ఏప్రిల్ 18: (హిం.స) కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు డిపాజిట్ దక్కకుండా చేయాలని మల్కాజిగిరి పార్లమె
మల్కాజిగిరి నియోజకవర్గ నుండి నామినేషన్ దాఖలు చేసిన ఈటెల రాజేందర్


మేడ్చల్ ఏప్రిల్ 18: (హిం.స)

కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు డిపాజిట్ దక్కకుండా చేయాలని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఓటర్లను కోరారు. గురువారం ఆయన దశమిని పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు.

అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారన్నారని విమర్శించారు. ప్రజల నుంచి మోడీకి మంచి స్పందన వస్తున్నదని, అనేక వర్గాల ప్రజలు, సంఘాలు మరొక సారి మోడీని గెలిపించేందుకు మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. ముఖ్యంగా ముస్లిం మహిళలు కూడా మోడీకి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. మోడీ వచ్చిన తర్వాతే దేశానికి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పెరిగాయన్నారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande