తెలంగాణ పెద్దపల్లి ఏప్రిల్ 18 (హిం.స)
పెద్దపల్లి లోక్ సభ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ కు నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలను అందజేశారు.
మొదటి రోజున స్వతంత్ర అభ్యర్థులుగా అక్కపాక తిరుపతి, దూడ మహిపాల్, డి.రాజ్ కుమార్, నూకల నవీన్ లు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈనెల 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.
రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం