అమరావతి,18.ఏప్రిల్ (హిం.స): మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ) తరపున నామినేషన్ దాఖలైంది. గురువారం మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయంలో యువనేత తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియాకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను నేతలు అందజేశారు. టీడీపీ సమన్వయ కర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయ కర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ నేతృత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పోతినేని శ్రీనివాసరావు, దామర్ల రాజు, తోట పార్థసారధి, ఆరుద్ర భూలక్ష్మీ, ఆకుల జయసత్య, బొంతు సాంబిరెడ్డి, ఇబ్రహీం, విజయ్ కుమార్, చాగంటి పూర్ణ, జ్యోతిబసు, సంకా బాలాజీ గుప్తా, మైనర్ బాబు, రేఖా సుధాకర్ గౌడ్, ఇట్టా పెంచలయ్య హాజరయ్యారు. మధ్యాహ్నం 2:34 గంటలకు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్