గాంధీనగర్ నుండి నామినేషన్ వేసిన అమిత్ షా..
గాంధీనగర్ ఏప్రిల్ 19 (హిం.స) ఓవైపు లోక్ సభ తొలి విడత ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. మరోవైపు మిగతా ప్ర
గాంధీనగర్ నుండి నామినేషన్ వేసిన అమిత్ షా..


గాంధీనగర్ ఏప్రిల్ 19 (హిం.స)

ఓవైపు లోక్ సభ తొలి విడత ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. మరోవైపు మిగతా ప్రాంతాల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ రాష్ట్రాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు.

ఇక తాజాగా లోక్ సభ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ నామినేషన్ వేశారు. గుజరాత్లోని గాంధీనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ సీఎం పటేల్తో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ ప్రతాలను సమర్పించారు. ఇక గాంధీనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సోనాల్ పటేల్ బరిలోకి దిగారు.

హిందుస్థాన్ సమాచార్ రంజిత్ కుమార్


 rajesh pande