బిజెపికి షాక్.. కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
హైదరాబాద్ ఏప్రిల్ 19 (హిం.స)తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక
బిజెపికి షాక్.. కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్


హైదరాబాద్ ఏప్రిల్ 19 (హిం.స)తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇవాళ బీజేపీ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రవీంద్ర నాయక్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కండువా కప్పి రవీంద్ర నాయక్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదిలా ఉండగా రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ప్రకాష్ గౌడ్ రేపు తన ముఖ్య అనుచరులతో కలిసి పార్టీలో చేరతానని సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande